

భారత ప్రధాని నరేంద్ర మోదీపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రశంసలు కురిపించారు. సామాన్యులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. గత 25 ఏళ్లలో మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ఆయన ఎంతో క్రమశిక్షణతో పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక చర్చలో పాల్గొన్న కార్నీ, 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నారని తెలిపారు. ఆర్థిక సంస్కరణల ద్వారా కోట్ల మందిని సంఘటిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు.
ఇక మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించి ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొల్పాలని మోదీ అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరించే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు














.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!