

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గువాహటిలోని లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా 12 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి చేర్చారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రితో కలిపి అస్సాం మంత్రివర్గ సభ్యుల సంఖ్య 17కు చేరుకుంది.
కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో అశ్విని రాయ్ సర్కార్, అశోక్ సంఘాల్, బిమల్ బోరా, బిశ్వజిత్ డైమరీ, జయంత మల్లా బరువా, కౌషిక్ రాయ్, కేషబ్ మహంతా, కృష్ణేందు పాల్, నీలిమా దేవి, పిజుష్ హజారికా, రనోజ్ పెగు, సుశాంత బోర్గోహైన్ ఉన్నారు. ఈ కార్యక్రమం బహుభాషా సమ్మేళనంగా సాగింది. పలువురు అస్సామీలో ప్రమాణం చేయగా, బిమల్ బోరా సంస్కృతంలో, కౌషిక్ రాయ్ హిందీలో, కృష్ణేందు పాల్ బెంగాలీలో ప్రమాణస్వీకారం చేయడం విశేషంగా నిలిచింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!