
న్యూస్

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై నిర్మించిన చెక్డ్యామ్పై దుండగులు ధాటిగా విరుచుకుపడ్డారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెక్డ్యామ్లోని భాగాలను కూల్చివేయడంతో, వాగు నీరు వేగంగా దిగువ భాగాలకు చేరుతోంది.
సమాచారం అందుకున్న నీటిపారుదల శాఖ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాగులోని ఇసుకను అక్రమంగా రవాణా చేసేందుకు ఈ ధ్వంసం చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ దాడిలో చెక్డ్యామ్కు చెందిన మూడు ప్యానెల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇటీవలే రూ.23 కోట్లకు పైగా వ్యయంతో ఈ చెక్డ్యామ్ నిర్మాణం చేపట్టబడింది. ఇంత పెద్ద మొత్తంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఇలాంటి విధ్వంసానికి గురవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!