
టెక్నాలజీ

TG: రాష్ట్రంలో పలు కుటుంబాల్లో విషాదం నింపిన మీర్జాగూడ బస్సు ప్రమాదానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదంలో మరణించిన టిప్పర్, బస్సు డ్రైవర్లు మద్యం సేవించలేదని తేలింది. మృతదేహాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ తెలిపారు. అయితే వాహనాల స్థితిగతులకు సంబంధించిన రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!