
ఓటీటీ

సినిమా పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చల మధ్య జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడిన ఆమె, టాలీవుడ్లో పని సంస్కృతి ఎంతో బాగుంటుందని చెప్పారు. షూటింగ్ సెట్లలో పని గంటలకు, కళాకారుల సౌకర్యాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో అందరికీ విశ్రాంతి కల్పిస్తారని, ఆ తర్వాత మరింత ఉత్సాహంతో పనులు కొనసాగుతాయని జాన్వీ తెలిపారు. ‘దేవర’, ‘పెద్ది’ చిత్రాల చిత్రీకరణ సమయంలో తాను రోజుకు తొమ్మిది గంటలకు మించి పని చేయలేదని వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్క్ కల్చర్పై చర్చకు దారితీశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!