

ఐపీఎల్ 2026 ఫైనల్లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు టైటిల్ కలను నిజం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న అనంతరం కెప్టెన్ రజత్ పాటిదార్ భావోద్వేగానికి లోనయ్యారు. గత సీజన్ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని, ఈ విజయాన్ని మాటల్లో చెప్పలేనని పేర్కొన్నారు. బౌలింగ్ విభాగం మొత్తం టోర్నీలో అద్భుతంగా రాణించిందని, జట్టు ప్రణాళికలు విజయానికి ప్రధాన కారణమని చెప్పారు. ఆర్సీబీ అభిమానులు ఎక్కడికెళ్లినా తమకు హోమ్ గ్రౌండ్ అనుభూతిని కల్పించారని ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓటమిపై స్పందిస్తూ, జట్టు 180-190 పరుగులు సాధించి ఉంటే పోటీ మరింత ఉత్కంఠగా ఉండేదని అన్నారు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్పై పట్టు కోల్పోయామని పేర్కొన్నారు. అయినప్పటికీ టోర్నీ మొత్తం తమ బౌలింగ్ విభాగం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, తొలి మ్యాచ్ల్లో ఎదురైన నిరాశ తర్వాత జట్టు బలంగా పుంజుకుందని చెప్పారు. టైటిల్ అందుకోలేకపోయినా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!