

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం స్వయంగా కేంద్రమంత్రికి అందజేయగా, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సికింద్రాబాద్ డివిజన్పై అధిక భారం పడుతోందని, పరిపాలనా పరిమితులను దాటి ట్రాక్ కిలోమీటర్లు పెరిగిపోవడంతో నిర్వహణ కష్టంగా మారిందని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లు ఉండగా, భవిష్యత్తులో ఇది 3,150 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. ఇతర డివిజన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉందని, ఈ అసమతుల్యత వల్ల రైల్వే కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు ద్వారా కార్యకలాపాల వికేంద్రీకరణ జరిగి, ఉత్తర–తూర్పు తెలంగాణలో రైల్వే సేవలు మెరుగుపడటంతో పాటు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
అదేవిధంగా పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్ను హైదరాబాద్ డివిజన్కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళికంగా కాజీపేట డివిజన్లోనే ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే మార్గాల కీలక కూడలిగా ఉండటం, సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు వంటి సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయం లభిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక డివిజన్ అవసరం ఉందని చెప్పారు. భారతీయ రైల్వేల బలోపేతంతో పాటు తెలంగాణ ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు.
%2C_Shri_Hardeep_Singh_Puri_addressing_a_press_conference_on_Swachh_Survekshan_2018%2C_in_New_Delhi_on_May_16%2C_2018.jpg&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!