

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ టీమ్తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రాన్ని ఆయన వీక్షించి, సినిమా ఎంతో ఎంటర్టైనింగ్గా ఉందని ప్రశంసించారు. కొత్త దర్శకురాలు మానస శర్మ పనితనాన్ని, సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ను మెచ్చుకున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి నటులు కూడా భాగమయ్యారు. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుందని భావిస్తున్నారు. చరణ్ ప్రోత్సాహంతో ‘రాకాస’ టీమ్ మరింత ఉత్సాహంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా విడుదలైన వీడియోలో రామ్ చరణ్ తన అప్కమింగ్ మూవీ ‘పెద్ది’పై కూడా క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వస్తుండగా, వాటిని ఖండిస్తూ “పెద్ది లేట్ అవ్వట్లేదు” అని స్పష్టం చేశారు. షూటింగ్ ఆలస్యం కారణంగా విడుదల జూన్కు మారుతుందనే ప్రచారంలో నిజం లేదని తెలిపారు. పక్కా ప్రణాళికతో సినిమా పనులు జరుగుతున్నాయని, అనవసరపు పుకార్లను నమ్మవద్దని అభిమానులకు సూచించారు.
మరోవైపు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘రాకాస’ ప్రమోషన్స్కు హాజరైన చరణ్, ఒకేసారి నిహారిక సినిమాకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా తన సినిమా గురించి కూడా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులకు డబుల్ ట్రీట్ లభించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!