

భారత గ్రాండ్మాస్టర్ వైశాలి రమేష్ బాబు చరిత్ర సృష్టించింది. 24 ఏళ్ల చెన్నైకి చెందిన ఈ స్టార్ ప్రతిష్టాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ మహిళల టైటిల్ను గెలుచుకుంది. దీంతో క్యాండిడేట్స్ టోర్నమెంట్ను గెలిచిన తొలి భారత మహిళగా అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ విజయంతో ఆమె చదరంగ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆమె ప్రపంచ టైటిల్ కోసం ఛాలెంజర్గా అర్హత సాధించి, డిఫెండింగ్ ఛాంపియన్ మరియు చైనా గ్రాండ్మాస్టర్ వెన్జున్తో తలపడనుంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్కు సంబంధించిన వేదిక, తేదీలను ఫిడే త్వరలో ప్రకటించనుంది.
ఇక క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ 13వ రౌండ్కే విజేతగా నిలిచాడు. దీంతో అతను ప్రపంచ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ భారత గ్రాండ్మాస్టర్ గుకేష్తో సిందరోవ్ తుది పోరులో తలపడనున్నాడు. ఈ ఫలితాలతో క్యాండిడేట్స్ టోర్నమెంట్ మరింత ఆసక్తికరంగా మారింది.













.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!