

ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్ట్ శక్తిని కొలిచే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ ఐదు స్థానాలు దిగజారి 85వ ర్యాంక్లో నిలిచింది.భారత పౌరులు ఇప్పుడు వీసా లేకుండా కేవలం 57 దేశాలకు మాత్రమే ప్రయాణించగలరు. గత ఏడాది ఈ సంఖ్య 62 దేశాలుగా ఉండటంతో, భారత్ స్థానం దిగజారిందని నిపుణులు చెబుతున్నారు.ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సింగపూర్ పౌరులు వీసా లేకుండా 193 దేశాలకు వెళ్ళగలరు. దక్షిణ కొరియా (190 దేశాలు) రెండో స్థానంలో, జపాన్ (189 దేశాలు) మూడో స్థానంలో ఉన్నాయి.ఒక కీలక పరిణామంగా, అమెరికా పాస్పోర్ట్ తొలిసారి టాప్ 10 స్థానాల నుంచి బయటపడింది. గత ఏడాది ఏడో స్థానంలో ఉన్న అమెరికా, ఇప్పుడు మలేషియాతో కలిసి 12వ స్థానంలో ఉంది. యూరోపియన్ దేశాలు అయిన జర్మనీ, ఇటలీ, స్పెయిన్ టాప్ 5లో తమ స్థానాన్ని కొనసాగించాయి.
భారత్ ఈసారి తన 85వ స్థానంను ఆఫ్రికా దేశం మారిటానియాతో పంచుకుంది. భారతీయులు వీసా లేకుండా ప్రయాణించగలిగే దేశాలలో భూటాన్, ఇండోనేషియా, మాల్దీవులు, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, శ్రీలంక, అంగోలా, బార్బడోస్ ఉన్నాయి.ఇక పొరుగు దేశాల పాస్పోర్ట్ల స్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది — శ్రీలంక (98వ ర్యాంక్, 41 దేశాలు), బంగ్లాదేశ్ (100వ ర్యాంక్, 38 దేశాలు), నేపాల్ (101వ ర్యాంక్, 36 దేశాలు), పాకిస్థాన్ (103వ ర్యాంక్, 31 దేశాలు) భారత్ కంటే దిగువన ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అత్యంత బలహీనమైన పాస్పోర్ట్గా 24 దేశాలకు మాత్రమే యాక్సెస్ కలిగి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!