

గల్ఫ్ దేశాలతో వాణిజ్య చెల్లింపులను ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే నిర్వహించే అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సహ ఇతర దిగుమతులపై వచ్చే భారీ ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతూ, చమురు మరియు పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లు పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకు పైగా పెరగడం భారత్పై ఆర్థిక భారం పెంచుతోంది. దేశం తన ముడి చమురు అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున ఈ ప్రభావం వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉంది. 2024-25లో మొత్తం చమురు దిగుమతుల్లో గల్ఫ్ దేశాల వాటా 28 శాతం ఉండటంతో స్థానిక కరెన్సీల్లో చెల్లింపులు చేయడం ద్వారా ఈ భారాన్ని కొంత వరకు తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


















.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!