

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ఘాటు లేఖ రాశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జీఓ 7 ద్వారా పథకాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు.
రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండటంతో 2,500కు పైగా విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. గత 30 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వన్టైమ్ సెటిల్మెంట్, కమిటీలు అంటూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. వెంటనే జీఓను వెనక్కి తీసుకుని బకాయిలను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చవచ్చని హెచ్చరించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!