

ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వినూత్న కార్యక్రమాలను ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో మురుగు నీటి సమస్యకు “మ్యాజిక్ డ్రెయిన్స్” రూపంలో పరిష్కారం చూపడం గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థల కొరత వల్ల గ్రామాల్లో ఏర్పడే అపరిశుభ్ర పరిస్థితులను ఈ పద్ధతి సమర్థంగా ఎదుర్కొంటుందని ఆమె అన్నారు.
ఇంకుడు గుంతలు, మూడు స్థాయిల ఫిల్ట్రేషన్ వ్యవస్థతో రూపొందించిన ఈ డ్రెయిన్లు మురుగు నీటిని శుద్ధి చేసి భూగర్భ జలంగా మార్చుతాయి. నిల్వ నీరు, దుర్వాసన సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి. సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే 80% వరకు ఖర్చు తగ్గించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!