
గాసిప్స్

విచారణ సమయంలో ఐబొమ్మ రవికి సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తావా అని పోలీసులు ఆశ్చర్యకరమైన ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత రెస్టారెంట్ పెట్టాలని తన ప్లాన్ అని రవి పోలీసులకు చెప్పాడు. ఇకపై తప్పు మార్గంలో నడవను, చేసిన తప్పు గ్రహించాను, మళ్లీ ఎప్పుడూ పైరసీ చేయను అని కూడా రవి అంగీకరించాడు.
అలాగే తన దగ్గర ఉన్న మొత్తం 17 కోట్ల రూపాయల్ని ఎంజాయ్ చేసేందుకు ఖర్చు చేశానని రవి వెల్లడించాడు. ఇదే సమయంలో, రవి వేసిన బెయిల్ పిటిషన్పై విచారణ పూర్తయ్యింది, నాంపల్లి కోర్టు త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. కేసులో కొత్త వివరాలు బయటపడుతున్న నేపథ్యంలో, రవి భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందో అందరి దృష్టి అక్కడే నిలిచిపోయింది




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!