

మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను మోసం చేసిన సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఊర్మిళ వాట్సాప్కు వచ్చిన ఒక లింక్ ద్వారా ఈ సైబర్ మోసం మొదలైంది. పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి మోసం చేయగా, ట్రేడింగ్పై అనుభవం లేకపోవడంతో ఆమె భర్త సహాయంతో పెట్టుబడులు పెట్టారు.
కొద్ది రోజుల వ్యవధిలో 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను పెట్టుబడుల పేరుతో చెల్లింపులు చేయించి, దాదాపు రూ.2 కోట్ల లాభం వచ్చినట్లు నకిలీ వివరాలు చూపించారు. డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే ఇంకా డబ్బు చెల్లించాలని అడగడంతో మోసమని గుర్తించిన ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి ఈ భారీ ఆన్లైన్ మోసాన్ని బయటపెట్టారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!