

దేశవ్యాప్తంగా ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో పరిస్థితుల కారణంగా 2026 వేసవి సీజన్లో తీవ్రమైన ఎండలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. మార్చి నుంచి జూన్ మధ్య పలు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది. తెల్లవారుజామున స్వల్ప చలి ఉన్నప్పటికీ, పగటిపూట ఎండ తీవ్రత పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ నెల చివరి నాటికి చలి వాతావరణం పూర్తిగా తగ్గనుంది. హైదరాబాద్లో ఈ నెల 6 న పొడి వాతావరణం కొనసాగనుండగా, 7 వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో స్వల్ప చలి కొనసాగుతుంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!