

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి జానకి శుక్లా పాల్గొని సీతారాముల వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ మహోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు తిలకించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా తొలిసారి ఈ కార్యక్రమానికి హాజరైన శివ ప్రతాప్ శుక్లా దంపతులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలీప్యాడ్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు శాలువా, పుష్పగుచ్ఛాలతో గవర్నర్ను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గవర్నర్ భద్రాచలంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భద్రగిరి మార్ట్’ను ప్రారంభించారు. మార్ట్లో విక్రయానికి ఉంచిన గిరిజన ఉత్పత్తుల గురించి ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్, సహాయ ప్రాజెక్ట్ అధికారి (జనరల్) డేవిడ్ వివరించారు. గిరిజన ఉత్పత్తులను పరిశీలించిన గవర్నర్ దంపతులు కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజన కళాకారులను ప్రోత్సహించారు.





















.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!