

అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. అయితే ఈ ప్రకటనకు కొద్దిసేపటి ముందు సుమారు రూ.5,400 కోట్ల విలువైన భారీ ట్రేడింగ్ జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది యాదృచ్ఛికమా లేక ఇన్సైడర్ ట్రేడింగే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
న్యూయార్క్ కాలమానం ప్రకారం ఉదయం 6:49 నుంచి 6:50 మధ్యలోనే బ్రెంట్ క్రూడ్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్కు సంబంధించిన దాదాపు 6,200 ఫ్యూచర్ కాంట్రాక్టులు ట్రేడ్ అయ్యాయి. ట్రంప్ ప్రకటన తర్వాత ఇంధన మార్కెట్లలో భారీ అమ్మకాలు జరిగి చమురు ధరలు పడిపోగా, అమెరికా మరియు ఐరోపా స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. సాధారణంగా భౌగోళిక రాజకీయ పరిణామాలపై ముందస్తు అంచనాలతో ట్రేడింగ్ జరుగుతుందనిపించినప్పటికీ, ఈ ట్రేడింగ్ సమయం, పరిమాణం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించలేదు.



















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!