

సంగారెడ్డి జిల్లాలో నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మద్యం మత్తులో హంగామా చేయడం సంచలనంగా మారింది. బుధవారం కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామం వద్ద ఆమె కారు ఒక బైక్ను ఢీకొట్టిన ఘటన తర్వాత గ్రామస్థులతో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు ఆమె కారులో బీరు బాటిళ్లు గుర్తించగా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో 140 పాయింట్లు నమోదయ్యాయి. దీంతో మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు.
బైక్ను ఢీకొట్టిన తర్వాత లావణ్య అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. సారీ చెప్పాలని కోరగా, వారితో ఆమె వాగ్వాదానికి దిగినట్లు స్థానికులు తెలిపారు. ‘నేను సెలబ్రిటీని, నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు’ అంటూ హెచ్చరించిందని ఆరోపించారు. రాజకీయ పరిచయాలు ఉన్నాయని చెప్పి బెదిరింపులకు కూడా దిగినట్లు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి కారును స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ లావణ్య గైర్హాజరైనట్లు సమాచారం.
-1774425417157.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!