

సోషల్ మీడియాలో పదో తరగతి పరీక్షలు రద్దవుతాయన్న వార్తలపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2026-27 నుంచి ఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేసే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ ఈ వార్తలు తప్పని చెప్పారు. తాము ఇచ్చిన నివేదికలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను కలపాలని, 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని సూచించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థలో మార్పులు అవసరమని అన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా +2 విధానాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కమిటీ ఇచ్చిన నివేదిక తుది కాదని, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ను సీఎం సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్గా అభివర్ణించారు.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!