

నిషేధిత చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తనదైన శైలిలో స్పందించారు. సంక్రాంతి పండగ సందర్భంగా పతంగుల కోసం చైనా మాంజా ఉపయోగించవద్దంటూ హైదరాబాదీ యాసలో చేసిన ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. చైనా ఉత్పత్తులపై ఉండే సాధారణ సామెతను ప్రస్తావిస్తూ, “చలే తో చాంద్ తక్, వర్నా షామ్ తక్” అన్న మాట చైనా మాంజాకు మాత్రం వర్తించదని స్పష్టం చేశారు. ఇది నేరుగా ప్రాణాలకు ప్రమాదం తెచ్చేలా ఉంటుందని హెచ్చరించారు.
బైక్పై వెళ్తున్న సమయంలో అనుకోకుండా మెడకు చైనా మాంజా చుట్టుకుంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఊహించుకోవాలని సజ్జనార్ సూచించారు. సంక్రాంతి ఆనందం విషాదంగా మారకూడదంటే చైనా మాంజాకు దూరంగా ఉండాలని, చైనా మాంజాకు నో చెప్పండి అంటూ పిలుపునిచ్చారు. గాజు పొడి అద్దిన మాంజా, నైలాన్ దారాల విక్రయం లేదా వినియోగం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!