
గాసిప్స్
.webp&w=3840&q=75)
ఛత్తీస్గఢ్లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. బుధవారం అమితి బర్దార్ , అల్లూరి జిల్లా ఎస్పీ ఎదుట వారు లొంగినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ మరియు పునరావాస పథకాలను ఉపయోగించుకుని గౌరవప్రదమైన, శాంతియుత జీవితం గడపాలని వారికి సూచించారు.
అలాగే ప్రభుత్వం అందించే శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఇతర మావోయిస్టులు కూడా సమీప పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే కుటుంబ సభ్యుల ద్వారా లేదా నేరుగా సీనియర్ పోలీస్ అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని సాధారణ జీవితం వైపు తిరగాలని అధికారుల సూచన.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!