

దేశవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రహార్’ పేరుతో కొత్త జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని ప్రారంభించింది. హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ వ్యూహం ద్వారా ఉగ్రదాడులను ముందుగానే అడ్డుకోవడం, భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాదానికి మతం, జాతి లేదా సమాజం లేదని కేంద్రం స్పష్టం చేస్తూ అన్ని రకాల హింసపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది.
ప్రహార్ వ్యూహం కింద కేంద్ర-రాష్ట్ర సంస్థల సమన్వయం, చట్టపరమైన చర్యలతో పాటు మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. డ్రోన్లు, డిజిటల్ సాధనాల ద్వారా పెరుగుతున్న హైటెక్ ఉగ్ర ముప్పులను ఎదుర్కొనే చర్యలు కూడా ఇందులో భాగం. ఇదే సమయంలో ‘ఆపరేషన్ కగార్’ ద్వారా దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చే కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 31లోపు మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా దళాలు విస్తృతంగా చర్యలు చేపడుతున్నాయి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!