
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే కొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక తెలంగాణలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.




















.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!