
క్రీడలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై కీలక చర్చ జరగనుంది. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించే నాలుగు మార్గాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులను 100 రోజుల్లో క్లియర్ చేయడం, డీఏలు, క్యాష్లెస్ వైద్యం, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. కొత్త ఆసరా పింఛన్లు, తెలంగాణ ఉద్యమకారుల కోసం పథకాలు, ఇందిరమ్మ బీమా వంటి అంశాలపై కూడా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!