
క్రీడలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. తెలంగాణలో 301 మండలాలకు హీట్వేవ్ అలర్ట్ జారీ చేయగా, సుమారు 1.60 కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఏపీలో 17 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, నెల్లూరు 46.2°C, ప్రకాశం 46.1°C, తిరుపతి 45.6°C వంటి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో ఈదురుగాలులతో చెట్లు కూలిపోవడంతో కొంతసేపు జనజీవనం స్తంభించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!