
క్రీడలు

హైదరాబాద్లో ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై మల్కాజ్గిరి ఎస్బీ, ఎస్ఓటీ పోలీసులు మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో టికెట్ మోసం ముఠా బట్టబయలైంది. జడ్జిలు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ఎచ్సీఏకు ఫోన్లు చేసి టికెట్లు పొందేందుకు ప్రయత్నించిన ముఠాపై అనుమానం రావడంతో ఈ ఆపరేషన్ చేపట్టారు.
పీఎంఓ, గవర్నర్ కార్యాలయం, ఇతర క్రికెట్ సంఘాల పేర్లతో నకిలీ లేఖలు సృష్టించి టికెట్లు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఎచ్సీఏ టికెట్లను ఎరగా ఉపయోగించగా, బ్లాక్లో అమ్ముతుండగా ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు అశోక్ అదుపులో ఉండగా, మిగతా సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!