

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక చారిత్రాత్మక విజయ క్షణంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఆమోదంతో అమరావతిను ఏకైక రాజధానిగా అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రజల్లో, ముఖ్యంగా అమరావతి రైతుల్లో అపార ఆనందాన్ని కలిగించింది. ఇది వారి త్యాగాలకు, ఆశలకు, భవిష్యత్తు తరాల కలలకు లభించిన న్యాయం. అమరావతి ఇప్పుడు మన గౌరవానికి, భవిష్యత్తుకు ప్రతీకగా నిలిచింది.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల సహనం, త్యాగం, నిబద్ధత ఫలితమని ఆయన చెప్పారు.
ఈ చట్టబద్ధతతో పెట్టుబడిదారులకు నమ్మకం పెరుగుతుందని, అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని బాలకృష్ణ తెలిపారు. మనందరం కలసి అమరావతిని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. చివరగా “జై ఆంధ్రప్రదేశ్ – జై అమరావతి” అంటూ తన సందేశాన్ని ముగించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!