

రాష్ట్రానికి అదనంగా 1,90,890 హెచ్పీవీ టీకా డోసులు కేంద్ర ప్రభుత్వం పంపినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గత నెలలో తొలివిడతగా 1,90,800 డోసులు పంపించి, 14 - 15 ఏళ్ల బాలికలను గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యలు ప్రారంభించారు. తాజా డోసులను కూడా జిల్లాల వారీగా బాలికల సంఖ్యకు అనుగుణంగా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల వరకు టీకా పంపిణీ నిరంతరంగా కొనసాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 14 నుండి 15 ఏళ్ల మధ్య వయస్సు గల సుమారు 3.45 లక్షల బాలికలను గుర్తించారు. ఇప్పటివరకు 1,14,512 మంది బాలికలకు టీకా అందించగా, ఇది సుమారు 33.19 శాతానికి సమానం. కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా టీకా పంపిణీ జరిగింది. పోలవరం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో తక్కువ సంఖ్యలో టీకాలు ఇచ్చారు. పరీక్షలు పూర్తికావడంతో టీకా పంపిణీ వేగం మరింత పెరగనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!