

అమరావతిలోని శాఖమూరు పార్కులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు పలువురు మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వారు అమరజీవికి నివాళులు అర్పించారు.
పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల నిరాహార దీక్షను గుర్తు చేస్తూ 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. “అమరజీవి – త్యాగ శిల్పం (Statue of Sacrifice)” పేరుతో ఈ కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. అమరావతిలోని శాఖమూరు పార్కులో 6.80 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ తొలి దశ పనులు కేవలం ఆరు నెలల్లో పూర్తి కావడం ప్రత్యేకత.
ఈ భారీ విగ్రహ నిర్మాణానికి 26 టన్నుల కాంస్యం మరియు 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ ఉపయోగించారు. రెండో దశలో ఇక్కడ మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నిర్మించే ప్రణాళిక ఉంది. అమరావతిలో తొలి భారీ శిల్పంగా ఈ విగ్రహం ప్రత్యేక గుర్తింపు పొందింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!