
రాజకీయాలు

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వేగంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల నేపథ్యంలో సమర్థవంతమైన విద్యుత్ సరఫరా అవసరమని ఆయన పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా సబ్స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 18 సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా, విద్యుత్ సరఫరాలో ఏఐ టెక్నాలజీ వినియోగించాలన్నారు. రైతు డిస్కమ్పై ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించాలని కూడా ఆదేశించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!