

ఇటీవల దీపికా పదుకొనే వరసగా తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు, ఆమె పేరును మళ్లీ మళ్లీ వార్తల్లోకి తెస్తున్నాయి. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుండి బయటకు రావడం, ఆ తర్వాత కల్కి 2 నుంచి కూడా తప్పుకోవడం సినిమాపరిశ్రమలో ఆశ్చర్యాన్ని రేకెత్తించాయి. పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో వరుసగా ఆమె వైదొలగడం ఫ్యాన్స్, నెటిజన్లలో ఎన్నో ప్రశ్నలను తెప్పించింది.
ఇవి చర్చలో ఉన్నప్పుడే, ₹500–600 కోట్ల భారీ సినిమాలు తనను ఇక ఆకట్టుకోవడం లేదని, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, మంచి కథలను నిర్మించడం ఇప్పుడు తనకి ముఖ్యమని దీపికా చెప్పింది. అయితే సోషల్ మీడియాలో చాలా మంది దీనిని డబుల్ స్టాండర్డ్గా అభివర్ణిస్తున్నారు. అలాంటి భారీ సినిమాలు తనకు ఇష్టం లేకపోతే మొదట్లోనే స్పిరిట్, కల్కి వంటి ప్రాజెక్టులను ఎందుకు సైన్ చేసిందని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
హార్పర్స్ బజార్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, దీపికా ప్రస్తుతం తన టీమ్తో కలిసి ఉత్తమ కథలు చెప్పే నటులు, రచయితలు, దర్శకులను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించింది. కానీ అదే సమయంలో ఆమె షారుక్ ఖాన్ కింగ్, అల్లు అర్జున్ అట్లీ భారీ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండటం నెటిజన్ల ఆక్షేపణకు కారణమైంది. దీంతో దీపికా మాటలు నిజంగా ఆమె కొత్త దిశను సూచిస్తున్నాయా లేక ఇటీవల వదిలేసిన ప్రాజెక్టులకు ఇచ్చిన వివరణలా అనిపిస్తున్నాయా అనే చర్చ కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!