

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మార్చి 4 సాయంత్రం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఈ జంట, కార్యక్రమం సజావుగా జరిగేందుకు ఆహ్వానం పొందిన అతిథులు మాత్రమే హాజరుకావాలని అధికారిక ప్రకటన ద్వారా కోరింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని అభిమానులు ఆహ్వానం లేకుండా వేడుకకు రావద్దని, తమ ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచైనా అందిస్తే చాలని ఈ జంట పేర్కొంది. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని వారు వెల్లడించారు.












.png&w=3840&q=75)


కామెంట్స్ (1)
good