
సినిమాలు

హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ తాజ్ కృష్ణలో నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నగరంలో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ రిసెప్షన్కు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతా రెడ్డి హాజరయ్యారు. అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్ పాల్గొన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కే. శివకుమార్ కూడా ఈ వేడుకకు హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు రష్మిక మందన్న తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. కొత్త దంపతులను ఆశీర్వదిస్తూ అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!