
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్లోనూ హీరోయిన్గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి త్రిష, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తున్నారు. తమిళనాడు సీఎం విజయ్తో ఆమెకు రిలేషన్ ఉందంటూ వచ్చిన రూమర్స్ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
తాజాగా త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ మాత్రం వైరల్గా మారింది. తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేస్తూ “నా వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తాను” అని క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ ద్వారా రూమర్స్కు పరోక్షంగా చెక్ పెట్టిందని నెటిజన్లు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!