
రాజకీయాలు

నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ హక్కుల కోసం దాదాపు రూ.105 కోట్ల డీల్పై సంప్రదింపులు జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా మ్యూజిక్, డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించి పలు భారీ డీల్స్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలుగు మార్కెట్లో రూ.105 కోట్ల పెట్టుబడితో ‘రామాయణం’ను తీసుకురావడం ఎంతవరకు ఫలిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!