

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అవసరమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేబినెట్ విస్తరణ జరిగితే ప్రభుత్వంలో కొత్తదనం కనిపిస్తుందని, అసంతృప్తిగా ఉన్న నేతలను సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పార్టీలో గ్రూపు తగాదాలను తగ్గించాలని, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమిష్టిగా పనిచేస్తేనే ప్రతిపక్షాన్ని బలంగా ఎదుర్కొని తిరిగి అధికారంలోకి రావచ్చని పేర్కొన్నారు.
పార్టీలోని కొన్ని అంశాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుఖేందర్ రెడ్డి అన్నారు. కొండా సురేఖ వ్యవహారంలో కూడా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునర్వ్యవస్థీకరణ ద్వారా చర్యలు తీసుకోవచ్చని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. అర్హులైన వారికే ఉచిత పథకాలు అందించాలని, అధికారుల తీరు మారితేనే ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని గుత్తా సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!