

టాలీవుడ్ అగ్ర కథానాయకులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్చరణ్ జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు సాధించారు. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన షోస్టాపర్స్ 2026 జాబితాలో వీరిద్దరికీ చోటు దక్కింది. దేశవ్యాప్తంగా వినోదం, క్రీడలు, పాపులర్ కల్చర్ రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక తెలుగు సినీ తారలు అల్లు అర్జున్, రామ్చరణ్ కావడం విశేషం.
అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ విజయంతో తన పాన్ ఇండియా ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ఇండియా షోస్టాపర్స్ 2026 కవర్పై కూడా ఆయన మెరిశారు. ‘పుష్ప’తో ప్రారంభమైన ఆయన జాతీయ స్థాయి ప్రయాణం ‘పుష్ప 2’తో మరింత విస్తరించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్డమ్ను దేశవ్యాప్తంగా నిలబెట్టిన నటుడిగా అల్లు అర్జున్ మరోసారి గుర్తింపు పొందారు.
ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు అందుకున్న రామ్చరణ్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం ‘పెద్ది’తో పాటు పలు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా జోనస్, రణ్వీర్ సింగ్, దక్షిణాది నుంచి రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్, మోహన్లాల్, మమ్ముట్టి వంటి ప్రముఖులు ఉన్నారు. క్రీడా రంగం నుంచి విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ వంటి స్టార్లు కూడా చోటు దక్కించుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!