
షోస్

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో రక్షాబంధన్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గమ్హా పూర్ణిమ సందర్భంగా ఏటా సోదరి సుభద్ర తన అన్నలు జగన్నాథుడు, బలభద్రులకు రాఖీలు కట్టడం ఆనవాయితీ. ఈ సంప్రదాయంలో భాగంగా ఈసారి జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పటారా కళాకారులు బసుంగా పట్టు దారాలతో ఈ భారీ రాఖీలను తయారు చేస్తున్నారు. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ వంటి పలు రంగులతో వాటిని ఆకర్షణీయంగా అలంకరిస్తున్నారు. భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ ప్రత్యేక రాఖీలు పూరీ జగన్నాథ ఆలయ రక్షాబంధన్ వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకురానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!