27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

Writer: Pooja 01:49 PM, 27 ఆగస్టు, 2026
అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

రక్షాబంధన్‌ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో అక్కాతమ్ముళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. రెండున్నరేళ్లుగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తమ్ముడు జితేంద్ర సింగ్‌ గంగ్వార్‌ (40) పరిస్థితిని చూసి తట్టుకోలేక బీనా కుమారి గంగ్వార్‌ (45) తన కిడ్నీని దానం చేశారు. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి వచ్చిన జితేంద్రకు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించడంతో బీనా కుమారి ముందుకు వచ్చారు.

గ్రేటర్‌ నోయిడాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జితేంద్రకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఆపరేషన్‌ అనంతరం తన అక్క గురించి జితేంద్ర భావోద్వేగానికి గురయ్యారు. డయాలసిస్‌ సమయంలో తన పిల్లల బాధ్యతలను కూడా బీనా కుమారే చూసుకున్నారని, ఇప్పుడు తనకు కొత్త జీవితాన్ని అందించారని తెలిపారు. తన అక్క చేసిన సాయానికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.

తమ్ముడికి కిడ్నీ దానం చేయడంపై బీనా కుమారి మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తనకు ఏమాత్రం కష్టంగా అనిపించలేదని చెప్పారు. తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయానని, కిడ్నీ దానం చేయడం తనకు త్యాగంగా అనిపించలేదని తెలిపారు. అక్కగా తన ప్రేమ, బాధ్యతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ అక్కాతమ్ముళ్ల అనుబంధంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

కర్ణాటక  ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

కర్ణాటక ఇంధన శాఖ మంత్రితో భట్టి విక్రమార్క భేటీ

ట్యాగ్లు
రక్షాబంధన్అక్కాతమ్ముళ్ల అనుబంధంకిడ్నీ దానంగ్రేటర్ నోయిడాస్ఫూర్తిదాయక కథకుటుంబ ప్రేమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 రూమర్స్‌పై సీరత్‌ కపూర్‌ స్పందన.. అసలు విషయం ఇదే!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 రూమర్స్‌పై సీరత్‌ కపూర్‌ స్పందన.. అసలు విషయం ఇదే!

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ
క్రీడలు

క్రీడలు పతకాలకే పరిమితం కాదు యువశక్తికి సాధనం - ప్రధాని మోదీ

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ
జనరల్

జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి
జనరల్

అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం...నలుగురు మృతి

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...
జనరల్

అక్క ప్రేమకు ఇదే నిదర్శనం...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేశ్‌ సమీక్ష

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు
సినిమాలు

ఫోర్బ్స్‌ షోస్టాపర్స్‌ జాబితాలో టాలీవుడ్‌ హీరోలు

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌
బిజినెస్

ఉల్లి ధరలపై కేంద్రం ఫోకస్‌

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా
బిజినెస్

అమెరికాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
జనరల్

గల్లంతైన వారిలో 300 మంది భారతీయులే : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...
క్రీడలు

భారత్‌ U19 జట్ల ప్రకటన.. వన్డే జట్టులో సెహ్వాగ్‌, ద్రవిడ్‌ కుమారులు...

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష
జనరల్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై లోకేష్ సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!