
జనరల్

స్టార్ నటి సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి స్వయంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ నెల 19న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మహిళా కేంద్రిత చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రమోషన్స్ను చిత్రబృందం వేగవంతం చేసింది.
తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో సమంత ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మొదట ఈ కథ కోసం సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నారని, కానీ ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా తాను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ సినిమా తనను తానే ఎంపిక చేసుకుందని భావిస్తున్నానని చెప్పిన సమంత, ఈ చిత్రం అనేక మంది మహిళా నటులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!