

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ నెల 15న గ్రాండ్గా థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సినిమాను మధుదీప్ చెలికాని రచించి దర్శకత్వం వహించారు.సీహెచ్.వి.ఎస్.ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై అరవింద్ మండెం నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించగా, శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
ప్రెస్ మీట్లో చిత్రబృందం మాట్లాడుతూ ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపారు. దర్శకుడు మధుదీప్ మాట్లాడుతూ కథలో ప్రేమ, భావోద్వేగాలు, సరదా అంశాలు ఉన్నాయని చెప్పారు. పాయల్ రాధాకృష్ణ, త్రిగుణ్ సహా మొత్తం టీమ్ అద్భుతంగా పని చేసిందని పేర్కొన్నారు. ఈ నెల 15 న ఈ సమ్మర్ స్పెషల్ ఎంటర్టైనర్ను థియేటర్స్లో తప్పకుండా చూడాలని మేకర్స్ ప్రేక్షకులను కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!