
క్రీడలు

సినీ వారసుల ఎంట్రీపై దక్షిణాది సినిమా పరిశ్రమలో మరోసారి చర్చ జోరందుకుంది. చెన్నైలో జరిగిన ‘కరుప్పు’ ప్రీమియర్ వేడుకలో నటుడు సూర్య తన కుటుంబంతో హాజరుకావడంతో ఈ అంశం మరోసారి హైలైట్ అయింది. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే ఆయన పిల్లలు దియా, దేవ్ అక్కడ కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
దేవ్ తన తండ్రి సూర్యను తలపిస్తున్నాడని, దియా తన తల్లి జ్యోతికను గుర్తు చేసిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వారి మర్యాదపూర్వక ప్రవర్తన కూడా అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణపై కూడా యువతలో ఆసక్తి పెరుగుతోంది. వీరంతా భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తే సౌత్లో కొత్త తరం స్టార్ పోటీ మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!