

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించి, దర్శకురాలు సుధ కొంగర తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పరాశక్తి’ ఈ నెల 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులు, వివాదాలు దాటుకుని విడుదలైన ఈ పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు కొత్త వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. కోలీవుడ్కే కాకుండా దక్షిణ భారత రాజకీయాల్లోనూ ఈ సినిమా తీవ్ర చర్చలకు దారితీస్తుండగా, తమిళనాడులో చిత్రాన్ని నిషేధించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
1965 లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంతో సినిమా తెరకెక్కిందని, అయితే చరిత్రను వక్రీకరించారని తమిళనాడు యూత్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీని కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వారు మండిపడుతున్నారు. శివకార్తికేయన్ పాత్ర ఇందిరాగాంధీని కలిసే సన్నివేశాలు పూర్తిగా కల్పితమని, చారిత్రక ఆధారాలు లేవని యూత్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో BanParasakthi, SupportParasakthi హ్యాష్ట్యాగ్లతో చర్చలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!