
రాజకీయాలు

సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రేణు దేశాయ్ కొత్త ఆసక్తికర ప్రాజెక్ట్తో ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆధ్యాత్మిక నగరం కాశీలో జరుగుతోంది. అడ్వర్టైజింగ్ రంగంలో గుర్తింపు పొందిన యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తుండగా, శంకర్ ఇందుచూడన్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
దర్శకుడు యమునా కిశోర్తో పాటు నటుడు శంకర్ ఇందుచూడన్తో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని రేణు దేశాయ్ తెలిపారు. మహాదేవుడి క్షేత్రమైన కాశీలో షూటింగ్ జరగడం తనకు దైవానుగ్రహంగా అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే సినిమా టైటిల్, కథ వివరాలను మాత్రం ఇంకా రహస్యంగా ఉంచారు. దీంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!