

తమిళనాడులోని నామక్కల్ జిల్లా నామగిరిపేట సమీపంలోని మలైయాంపట్టి గ్రామంలో ఉన్న పొంగళాయి అమ్మన్ ఆలయంలో వందేళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేక సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ ఆలయ వార్షిక ఉత్సవాల్లో పురుషులు మాత్రమే పాల్గొనడం విశేషం. ఈ ఏడాది జూలై 26న ప్రారంభమైన ఉత్సవాల్లో సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆచారాల ప్రకారం మేకపోతులను బలి ఇచ్చి, వందల కిలోల బియ్యం, మాంసంతో సామూహిక విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు 10 వేల మందికిపైగా పురుష భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.
స్థానికంగా ప్రచారంలో ఉన్న గాథ ప్రకారం, వందేళ్ల క్రితం భారీ వర్షంలో గర్భిణిగా వెళ్తున్న పొంగళాయికి గ్రామస్థులు సహాయం చేయకపోవడంతో ఆమె శాపం పెట్టిందని చెబుతారు. అప్పటి నుంచి మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం లేదని స్థానికుల విశ్వాసం. అలాగే ఈ ఆలయంలో మొక్కుకుంటే వివాహ సంబంధిత అడ్డంకులు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ విశ్వాసాలు, సంప్రదాయాలు నేటికీ గ్రామ ప్రజల ఆచార వ్యవహారాల్లో భాగంగా కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!