

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13 న గ్రాండ్గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రవితేజ, సినిమా విశేషాలతో పాటు తన రాబోయే ప్రాజెక్ట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు దర్శకులతో పనిచేసినప్పుడు సినిమా ఫలితం ఎలా ఉన్నా, వారి డైరెక్షన్లో పనిచేయడం తాను విపరీతంగా ఎంజాయ్ చేస్తానని తెలిపారు.
అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, బాబీ, కిషోర్ తిరుమల వంటి దర్శకులతో పని చేయడం తనకు ఎంతో ఇష్టమని రవితేజ అన్నారు. తదుపరి సినిమా శివ నిర్వాణతో ఉంటుందని, మంచి ఐడియాతో ఆ ప్రాజెక్ట్ వస్తుందని పేర్కొన్నారు. దర్శకుల విజన్ బలంగా ఉంటే నటులు 50 శాతం చేసినా సినిమా సూపర్గా వస్తుందని వ్యాఖ్యానిస్తూ, బాబీ చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ అని ప్రశంసించారు. ఇక ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పూర్తిగా ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ అని, జనవరి 13 న థియేటర్లలో ప్రేక్షకులను కలుద్దామని పిలుపునిచ్చారు. రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!