
సినిమాలు

రష్మిక మందన్న మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ప్రముఖ మ్యాగజైన్ ఇండియా టుడే దేశంలోనే టాప్ హీరోయిన్గా రష్మికను పేర్కొంది. ‘ది న్యూ నేషనల్ స్టార్’ అంటూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సాయి పల్లవి, అలియా భట్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు మ్యాగజైన్ తెలిపింది.
ఇటీవల ‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘ఛావా’ వంటి వరుస విజయాలతో రష్మిక పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ను మరింత పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాల విజయాలు ఆమె క్రేజ్ను దేశవ్యాప్తంగా బలోపేతం చేశాయి. ఇండియా టుడే మ్యాగజైన్ ఫొటోను షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. రష్మికపై గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!