

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మహిళా కేంద్రిత యాక్షన్ ఎంటర్టైనర్ మైసా తో దర్శకుడిగా రవీంద్ర పుల్లే అరంగేట్రం చేస్తున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్తో మంచి అంచనాలు రేకెత్తించింది. తాజాగా విడుదలైన టీజర్ మైసా యొక్క చీకటి, తీవ్ర ప్రపంచానికి గ్లింప్స్ ఇస్తోంది. కథానాయిక తల్లి వాయిస్ ఓవర్తో “మైసా అనే పేరు గుర్తుంచుకోండి” అంటూ టీజర్ మొదలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో రష్మిక తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, రా, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. గోండ్ మహిళగా ఆమెను చూపించిన విధానం పూర్తిగా కొత్తగా ఉండటంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండివుంది. దర్శకుడు రవీంద్ర పుల్లే తన తొలి ప్రయత్నంలోనే గట్టి ముద్ర వేస్తూ కథను ధైర్యంగా ఆవిష్కరించారు. ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించగా, శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ, జేక్స్ బీజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆండీ లాంగ్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు అదనపు బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణతో పాటు కేరళ అరణ్యాల్లో షూటింగ్ జరుగుతున్న మైసా రూటెడ్, రా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!