

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పునర్నవి భూపాలం తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆమె ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఆ సినిమాలో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు పొందింది. తరువాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అనంతరం బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో పాల్గొని మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
గత ఏడాది డిసెంబర్లో తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఆమె తన ప్రియుడు హేమంత్ వర్మను వివాహం చేసుకుంది. హేమంత్ వర్మ ప్రముఖ ఫోటోగ్రాఫర్గా గుర్తింపు పొందిన వ్యక్తి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పెళ్లి వేడుకను చాలా సింపుల్గా కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య నిర్వహించారు. చాలా ప్రైవేట్గా జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పునర్నవి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!